నల్గొండ జిల్లా పోలీసులు మరో కీలక విజయాన్ని సాధించారు. వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు, చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు ₹22 లక్షల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలు, హ్యుందాయ్ వెర్నా కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కట్టంగూర్, నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు నిందితులను గుర్తించి పట్టుకున్నాయి. నిందితులు జాతీయ రహదారుల వెంట సాయంత్రం వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వృద్ధులు, మహిళలను బెదిరించి ఆభరణాలు దోచుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.